HomeUncategorizedPakistan attacks with drones | డ్రోన్​లతో 26 ప్రాంతాల్లో దాడికి యత్నించిన పాక్​

Pakistan attacks with drones | డ్రోన్​లతో 26 ప్రాంతాల్లో దాడికి యత్నించిన పాక్​

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan attacks with drones : ఆపరేషన్‌ సిందూర్​తో భారత్​ ప్రతీకార దాడి చేపట్టాక.. పాకిస్తాన్​ వరుసగా మూడోరోజు కూడా దుస్సాహసానికి ఒడిగట్టి భంగపడింది. శుక్రవారం అర్ధరాత్రి జమ్మూకశ్మీర్ నుంచి గుజరాత్‌లోని భుజ్ వరకు 26 ప్రాంతాల్లో డ్రోన్​లతో దాడులకు యత్నించింది.

కాగా, పాక్​ కుయుక్తులను భారత్‌ సమర్థంగా తిప్పికొట్టింది. శ్రీనగర్‌ సహా పలు విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపై పాక్​ డ్రోన్లు ప్రయోగించగా.. భారత్​ వైమానిక వ్యవస్థ వాటిని నిర్వీర్యం చేసింది. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్, అవంతీపొరా ఎయిర్‌బేస్‌ సురక్షితంగా ఉన్నట్లు ఇండియన్​ ఆర్మీ స్పష్టం చేసింది. డ్రోన్‌ దాడుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్‌ కొనసాగించారు. జనం ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Must Read
Related News