HomeUncategorizedMumbai Airport | ముంబై ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

Mumbai Airport | ముంబై ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Mumbai Airport | ముంబై ఎయిర్​పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgam terror attack) తర్వాత భారత్​, పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. భారత్ ఆపరేషన్ సిందూర్​(Operation Sindoor)తో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో వంద మంది టెర్రరిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే బాంబు బెదిరింపు ఫోన్​ కాల్స్​ వారికి తలనొప్పిగా మారాయి.

తాజాగా మంగళవారం ముంబై ఎయిర్‌పోర్ట్‌(Mumbai Airport)ను పేల్చివేస్తామంటూ అగంతకుల అధికారులకు ఫోన్​ చేశాడు. దీంతో మూడు గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌ను అధికారులు తనిఖీ చేశారు. బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఫేక్​ కాల్​ అని నిర్దారించుకున్నారు. ఆ కాల్​ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కాగా ఫేక్​ బెదిరింపు కాల్స్​తో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో బాంబు పెట్టినట్లు దుండగులు ఫోన్​, మెయిల్స్ చేస్తున్నారు. అధికారులు గంటల కొద్ది ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. చివరకు ఏమీ లేకపోవడంతో ఫేక్​ కాల్(Fake Call)​ అని చెబుతున్నారు.


ఇలాంటి కాల్స్​తో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియక ప్రతి కాల్​ కు అధికారులు స్పందిస్తున్నారు. గంటల తరబడి తనిఖీలు చేపడుతున్నారు. దీంతో సమయం వృథా అవడంతో పాటు ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఫేక్​ కాల్స్​ చేసే వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

Must Read
Related News