అక్షరటుడే, వెబ్డెస్క్:Kerala | కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం(Thiruvananthapuram) ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు(Bomb threat) వచ్చింది. ఎయిర్పోర్టును బాంబులతో పేల్చివేస్తామని ఓ ఆగంతకుడు ఎయిర్పోర్టు(Airport)కు మెయిల్ పంపించాడు. దీంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. బాంబ్ స్వ్కాడ్(Bomb Squad)ను వెంటనే పిలిపించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. టెర్మినల్స్ సహా ఎయిర్పోర్టు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా బాంబు లేదని నిర్ధారించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించే పనిలోపడ్డారు.
