Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | వాటర్​ ట్యాంక్​ ఎక్కిన యూత్​ కాంగ్రెస్​ నాయకులు.. ఎందుకంటే..?

Bodhan | వాటర్​ ట్యాంక్​ ఎక్కిన యూత్​ కాంగ్రెస్​ నాయకులు.. ఎందుకంటే..?

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: Bodhan | బోధన్ పట్టణంలో యూత్​ కాంగ్రెస్​ నాయకులు (Youth Congress leaders) వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంపై వారు ఆందోళనకు దిగారు. మంగళవారం వాటర్​ ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డికి (MLA Sudarshan Reddy) మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా బీటీనగర్​లో ఉన్న వాటర్​ ట్యాంక్​ ఎక్కారు. యూత్​ కాంగ్రెస్​ నాయకుడు తలారి నవీన్​ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన తమ నేతకు మంత్రి పదవి ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు.