HomeతెలంగాణBodhan Mla Sudarshan Reddy | బోధన్​కు మూడు విద్యుత్ సబ్​స్టేషన్ల మంజూరు

Bodhan Mla Sudarshan Reddy | బోధన్​కు మూడు విద్యుత్ సబ్​స్టేషన్ల మంజూరు

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: Bodhan Mla Sudarshan Reddy | బోధన్​ నియోజకవర్గానికి మూడు విద్యుత్​ ఉపకేంద్రాలను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఇరిగేషన్​ గెస్ట్​హౌస్​లో (Irrigation Guesthouse) ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని జాడి జమాల్పూర్ (Jadi Jamalpur)​, సాలూర మండలం, హనుమాన్​ ఫారంలకు విద్యుత్​ ఉపకేంద్రాలను మంజూరు చేశారు.

ఈ సందర్భంగా జాడిజమాల్పూర్​ గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​ బిన్​ హందాన్ (Taher bin Hamdan, Chairman of the Urdu Academy)​, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్​ రెడ్డి (DCC President Manala Mohan Reddy), ఏసీపీ శ్రీనివాస్ (ACP Srinivas)​, మున్సిపల్​ కమిషనర్​ వెంకట్ నారాయణ, ఏడీఈ కన్ స్ట్రక్షన్​ తోట రాజశేఖర్​, బోధన్​ టౌన్​ ఏఈ నాయిని కృష్ణ, శరత్​ రెడ్డి, గంగాశంకర్​, దాము, పులి శ్రీనివాస్​, జాడి జమాల్పూర్​ గ్రామస్థులు దేవదానం, శ్రీనివాసరావు, చిన్నయ్య పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు.