Yashoda Hospital
Yashoda Hospital | బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదు: వైద్యులు గణేష్​ జైషెత్వార్​

అక్షరటుడే, ఇందూరు: Yashoda Hospital | బ్లడ్​ క్యాన్సర్ (Blood cancer) ప్రాణాంతకమైన వ్యాధి కాదని అత్యాధునిక వైద్య విధానం ద్వారా నయం చేయవచ్చని హైటెక్ సిటీ (Hi-tech City) యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యుడు గణేష్ జైషెత్వార్ అన్నారు.

జిల్లా కేంద్రంలోని ప్రెస్​క్లబ్​లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ మాసం బ్లడ్​ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. బ్లడ్​ క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదని ఈ వ్యాధిని అత్యాధునిక చికిత్స ద్వారా నయం చేయవచ్చని తెలిపారు.

Yashoda Hospital | తక్కువ ఖర్చుతో వైద్యం..

బ్లడ్​ క్యాన్సర్​కు అభివృద్ధి చెందిన దేశాల్లో రూ. 10కోట్లకు పైగా ఖర్చు అవుతుందని.. భారతదేశంలో మాత్రం రూ.20లక్షలతో వైద్యం పూర్తవుతుందని వైద్యుడు గణేష్ జైషెత్వార్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతాప్ అనే బాలుడు బ్లడ్ క్యాన్సర్​తో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాద్​లోని యశోద ఆస్పత్రిలో సంప్రదించగా 2014 నుంచి 2017 వరకు చికిత్స అందజేశామన్నారు.

ప్రస్తుతం బాలుడు చదువులో, క్రీడల్లో మెరుగ్గా రాణిస్తున్నాడని చెప్పారు. అలాగే సోమేశ్వర్​ అనే బాలుడు 13ఏళ్ల వయస్సులో ఇదే వ్యాధితో బాధపడుతుంటే..అతడికి సైతం అద్భుత చికిత్సతో నాయం చేశామన్నారు.

వర్ని మండలానికి చెందిన రామారావు బ్లడ్ క్యాన్సర్​తో యశోద ఆస్పత్రికి రాగా.. ఆయనకు సైతం మెరుగైన చికిత్స​ అందించామని ఆయన తెలిపారు. 2025లో బ్లడ్​ క్యాన్సర్​కు ఖచ్చితమైన వైద్యం అందుబాటులోకి వచ్చిందని వారు స్పష్టం చేశారు. క్యాన్సర్ అంటేనే భయపడే రోజులు పోయాయని ప్రతి క్యాన్సర్​కు చికిత్సలు తప్పకుండా ఉన్నాయని ఆయన తెలిపారు.