అక్షరటుడే, ఇందూరు: BJYM | ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విగాథం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకు అనుమతించొద్దని బీజేవైఎం BJYM నాయకుడు leader ఎర్రం సుధీర్ కోరారు.
ఈమేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం (అక్టోబరు 24) రాత్రి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) కు వినతిపత్రం అందజేశారు.
BJYM | ఎంబీటీ పార్టీ స్పోక్ పర్సన్ వస్తున్నారని..
ఎంబీటీ MBT పార్టీ స్పోక్ పర్సన్ శనివారం జిల్లాకు వస్తున్నట్లు తమకు సమాచారం అందిందని సుధీర్ తెలిపారు. రియాజ్ కాల్చివేతపై సామాన్య ప్రజలను ఆయన రెచ్చగొట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అందుకని, ఇలాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకు రానివ్వొద్దని కోరారు. ఒకవేళ, జిల్లా కేంద్రానికి చేరుకుంటే హిందూ యువత ఆయనను అడ్డుకుంటుందని స్పష్టం చేశారు.
