HomeతెలంగాణBJP Nizamabad | రేపు జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాక

BJP Nizamabad | రేపు జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాక

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు (Ramachandra Rao) సోమవారం ఇందూరు పర్యటనకు రానున్నారని జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి(Dinesh Kulachary) తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని శ్రీరామ గార్డెన్​లో బూత్ స్థాయి సమ్మేళనం ఉంటుందని తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Arvind) హాజరవుతారని పేర్కొన్నారు. ఈ మేరకు ఇందల్వాయి (Indalwai) టోల్​గేట్​ వద్ద స్వాగత కార్యక్రమం ఉంటుందన్నారు. అక్కడి నుంచి ర్యాలీగా శ్రీరామ గార్డెన్​కు చేరుకుంటారని తెలిపారు.

కాంగ్రెస్​ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని దినేష్​ కులాచారి అన్నారు. ఓటు చోరీ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్​కు లేదని అన్నారు. రాహుల్ గాంధీ (Rahul gandhi) అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. సమావేశంలో జాతీయ పసుపు బోర్డు (National Yellow Board) ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, నాగోల లక్ష్మీనారాయణ, రూరల్ కన్వీనర్ పద్మా రెడ్డి, జిల్లా, నగర నాయకులు పాల్గొన్నారు.

Must Read
Related News