Homeజిల్లాలునిజామాబాద్​Paddy Centers | తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.. బీజేపీ నేతల వినతి

Paddy Centers | తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.. బీజేపీ నేతల వినతి

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డిని గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Paddy Centers | జిల్లాలో అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal), రాకేశ్​ రెడ్డి (Mla Rakesh reddy), బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి(Dinesh Kulachari) డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో వేల ఎకరాల్లో కోసిన పంటను కొనుగోలు కేంద్రాలు, రోడ్లపై కుప్పలుగా ఉంచారన్నారు. కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం.. వర్షాల వల్ల ధాన్యం తడిసి రంగుమారిందని వివరించారు.

Paddy Centers | మద్దతు ధరకు కొనాలి

వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎటువంటి నిబంధన పెట్టకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు కోరారు. అలాగే ప్రతి సీజన్​లో తగినన్ని టార్పాలిన్లు అందించకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. వినతిపత్రం అందించిన వారిలో పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.