అక్షరటుడే, ఇందూరు: Bjp leaders protest | కామారెడ్డిలోని కాంగ్రెస్ నాయకులు గుండాల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆరోపించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్పై దాడికి నిరసనగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ.. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అక్కడి నాయకులు ఎమ్మెల్యేపై దౌర్జన్యంగా దాడి చేసేందుకు కుట్రపన్నారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు నిజమైతే అందుకు సంబంధించిన రుజువులు అధికారుల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తగిన రుజువులు కలెక్టర్ ముందు పెట్టేందుకు సిద్ధమయ్యారని, దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు కూడా ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఉమ్మడి జిల్లాలో ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని సహించలేని కాంగ్రెస్ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
