HomeతెలంగాణBjp Nizamabad | తిరంగా ర్యాలీకి బీజేపీ పూర్తి మద్దతు

Bjp Nizamabad | తిరంగా ర్యాలీకి బీజేపీ పూర్తి మద్దతు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Bjp Nizamabad | సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న తిరంగా ర్యాలీకి బీజేపీ పూర్తి మద్దతునిస్తుందని జిల్లా అధ్యక్షుడు (Nizmabad Bjp President Dinesh Kulachari) దినేష్ కులాచారి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్​’లో (Operation Sindoor) త్రివిధ దళాల సైనికులు విజయం సాధించిన నేపథ్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కులసంఘాలు, వర్తకులు, స్వచ్ఛంద సంస్థలు, మైనారిటీ, క్రైస్తవులు ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పహల్గామ్​లో (Pahalgam Terror Attack) పర్యాటకులపై దాడిచేసినా.. భారతసైన్యం (Indian Army) మాత్రం కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిందని గుర్తు చేశారు. సమావేశంలో జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, కిశోర్, మాజీ కార్పొరేటర్లు మల్లేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.