Homeజిల్లాలుకామారెడ్డిBanswada | బైక్, డీసీఎం ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

Banswada | బైక్, డీసీఎం ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బైక్​ను డీసీఎం ఢీకొని ఒకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన నస్రుల్లాబాద్​లోని (Nasrullabad) నిజాంసాగర్​ కాలువ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన సాకలి సాయిలు, కుమ్మరి విఠల్ కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం ఎరువులు తెచ్చుకునేందుకు బోధన్ (Bodhan) వైపు బైక్‌పై బయలుదేరారు.

ఈ క్రమంలో నస్రుల్లాబాద్​ మండలం నిజాంసాగర్ కాలువ (Nizamsagar canal) వద్ద బైక్‌ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమచికిత్స​ అందించారు. కుమ్మరి విఠల్ స్వల్పగాయాలతో బయటపడగా.. సాకలి సాయిలు కుడిచేయి పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. దీంతో క్షతగాత్రుడిని అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ ప్రసాద్, పైలట్ శ్రీకాంత్ నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.