HomeతెలంగాణBihar election trains | తెలంగాణ మీదుగా బీహార్ ఎన్నికల రైళ్లు.. అవేమిటంటే..!

Bihar election trains | తెలంగాణ మీదుగా బీహార్ ఎన్నికల రైళ్లు.. అవేమిటంటే..!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Bihar election trains | బీహార్​కు నూతన రైళ్లు, పొడిగింపుల పండుగ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం బీహార్​కు కావల్సినన్ని రైళ్లు ప్రకటిస్తోంది.

కొన్నింటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు పొడిగిస్తోంది. ఇప్పటి వరకు కేవలం బీహార్​కే ఏడు అమృత్ భారత్ రైళ్ళను ప్రవేశ పెట్టడం గమనార్హం. దేశంలో అత్యధికంగా అమృత్ భారత్ రైళ్లను బీహార్​కే కేటాయించింది.

Bihar election trains | తెలంగాణ మీది నుంచి వెళ్లే రైళ్లు ఇవే..

బీహార్​లో 16602/01 జోగ్భనీ అమృత్ భారత్ రైలు Amrit Bharat trains ను రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు. ఈ రైలు జోగ్భని ఈరోడ్ నుంచి మంచిర్యాల, వరంగల్, ఖమ్మం రైల్వే స్టేషన్​ల మీదుగా ప్రయాణించనుంది.

ఇక మరో రైలు విషయానికి వస్తే.. బీహార్​లోని పాటలీ పుత్ర నుంచి ఎస్.ఎం.వి.టి బెంగళూరు వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ 22352/51 రైలును.. పాటలీ పుత్ర నుంచి బీహార్ లోని సహర్స జంక్షన్ వరకు పొడిగించారు. ఈ రైలుకు తెలంగాణలోని సిర్పూర్ కాగజ్​నగర్ Sirpur Kagaznagar, రామగుండం Ramagundam, వరంగల్ Warangal , ఖమ్మం Khammam రైల్వే స్టేషన్​లలో హాల్ట్ ఉంటుంది.

గత 6 సంవత్సరాలుగా ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలుగా నడుస్తున్న 07052/51 బీహార్​లోని రక్సల్ – సికింద్రాబాద్ – రక్సల్ రైలును తిరుపతి రైల్వే స్టేషన్ Tirupati railway station వరకు పొడిగించారు.

మరో వారం, 10 రోజుల్లో బీహార్​లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ముందట ప్రతిపాదిత ముజఫర్ పూర్ నుంచి సికింద్రాబాద్ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.