Homeజిల్లాలునిజామాబాద్​Best Available Scheme | బెస్ట్​ అవైలబుల్​ స్కీం బకాయిలను వెంటనే విడుదల చేయాలి

Best Available Scheme | బెస్ట్​ అవైలబుల్​ స్కీం బకాయిలను వెంటనే విడుదల చేయాలి

బెస్ట్​ అవైలబుల్​ స్కీం బకాయిలను వెంటనే విడుదల చేయాలని బోధన్​ జేఏసీ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్​లో ఎదుట ధర్నా నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Best Available Scheme | జిల్లాలో బెస్ట్​ అవైలబుల్​ స్కీం బకాయిలను వెంటనే విడుదల చేయాలని బోధన్​​ జేఏసీ నాయకులు నవాతే ప్రతాప్​ (Bodhan JAC leader Navate Pratap) డిమాండ్​ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు.

అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 300 స్కూళ్లలో బెస్ట్​ అవైలబుల్​ స్కీం (Best Available Scheme) అమలు అవుతోందన్నారు. సుమారు రూ.250 కోట్ల బకాయిలు పెండింగ్​లో ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఆయా స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థులను రానివ్వడం లేదని వివరించారు. ఈ కారణంగా ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల (students) జీవితాలు అగమ్యగోచరంగా మారాయన్నారు.

వెంటనే కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress government) స్పందించి బకాయిలను విడుదల చేస్తే విద్యార్థులు స్కూళ్లకు వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు దేవర్ల నాగరాజు, రాజన్న, ఆర్​ గౌతం కుమార్​, సంజయ్​, మోసిన్​, బాలరాజ్​, ప్రశాంత్​, శ్రీకాంత్​, మోహన్​, కిరణ్​, సతీష్​, శేఖర్​ తదితరులు పాల్గొన్నారు.