IPL 2025 | బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్​ వాయిదా
IPL 2025 | బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్​ వాయిదా

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL 2025 | భారత్​ – పాక్​ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్​(IPL)ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భారత్​–పాక్​ వైమానిక దాడులు(Air Strikes) చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్​ను మధ్యలో నిలిపేసిన బీసీసీఐ. ఐపీఎల్​ రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. క్రీడాకారులు, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మళ్లీ ఐపీఎల్​ నిర్వహిస్తారా? లేక ఈ సీజన్​ రద్దయినట్లేనా? అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.