అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Bandh | స్థానిక ఎన్నికల్లో (Local Body Elections) బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీ సంఘాలు ఈ నెల 14న బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బంద్ను వాయిదా వేస్తున్నట్లు బీసీ నేతలు తెలిపారు.
హైదరాబాద్ (Hyderabad)లోని లక్డీకపూల్లోని ఓ హోటల్లో బీసీ సంఘాల నేతలు ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 14న తలపెట్టిన తెలంగాణ బంద్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 18న తెలంగాణ బంద్ నిర్వహిస్తామని బీసీ నేత ఆర్ కృష్ణయ్య తెలిపారు. బంద్ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Telangana Bandh | జేఏసీ ఏర్పాటు
బీసీ రిజర్వేషన్ల (BC Reservations)పై అన్ని సంఘాలు కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా బీసీ సంఘాలన్నీ బీసీ జీఏసీగా ఏర్పడ్డాయి. దీని ఛైర్మన్గా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, వైస్ ఛైర్మన్గా వీజీఆర్ నారగోని, వర్కింగ్ ఛైర్మెన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్లుగా దాసు సురేష్, రాజారామ్ యాదవ్ ఎన్నికయ్యారు.
Telangana Bandh | పెద్ద ఎత్తున ఉద్యమం
బీసీ రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీల్లోని ప్రతి కులం నుంచి నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని.. వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. బీసీలను చట్ట సభల్లో కూర్చోబెట్టేవరకు ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పని చేశామో ఇప్పుడు కూడా అలాగే పోరాటాలు చేస్తామన్నారు. బీసీ ఉద్యమంలో అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు.