అక్షరటుడే, ఇందూరు: BC JAC | బీసీ జేఏసీ జిల్లా ఛైర్మన్గా పోతన్కర్ లక్ష్మీనారాయణ Pothankar Lakshminarayana నియమితులయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గీతాభవన్ (Geeta Bhavan) లో సోమవారం (అక్టోబరు 13) బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు.
అన్ని కమిటీల సూచన మేరకు లక్ష్మీనారాయణను బీసీ ఐకాస జిల్లా ఛైర్మన్ (Chairman) గా నియమించారు. కో ఛైర్మన్గా బొబ్బిలి నర్సయ్య నియమితులయ్యారు.
BC JAC | రాష్ట్ర కమిటీ సూచన మేరకు..
రాష్ట్ర కమిటీ ఛైర్మన్ R కృష్ణయ్య, వర్కింగ్ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు వీరిరువురిని నియమించినట్లు ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో బీసీ ఉద్యమానికి ఈ జేఏసీ పునాది కాబోతుందన్నారు.
త్వరలో ప్రతి కుల సంఘం నుంచి ఒక ప్రతినిధిని కో కన్వీనర్గా నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నాగరాజ్, సభ్యులు పాల్గొన్నారు.