అక్షరటుడే, వెబ్డెస్క్ : BC Bandh | బీసీ రిజర్వేషన్లను(Bc Reservations) అమలు చేయాలనే డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ‘బీసీ తెలంగాణ బంద్’ ఉమ్మడిజిల్లాలో విజయవంతంగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో వ్యాపార సంస్థలు, పాఠశాలలను మూసివేశారు.
బీసీ సంక్షేమ సంఘం(Bc Sankshema Sangham) ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున నగరంలోని బస్డిపో ఎదుట బస్సులు బయటకు రాకుండా ధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ ఆధ్వర్యంలో ప్రతినిధులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు వ్యాపార సంస్థల యజమానులకు బీసీ రిజరేషన్ల అత్యవసరాన్ని వివరించారు.
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్ డిపో ఎదుట నిరసన
BC Bandh | ఆర్టీసీ డిపో ఎదుట..
బీసీ జేఏసీ(BC JAC) ఆధ్వర్యంలో ఆల్పార్టీ ఆధ్వర్యంలో బస్డిపో ఎదుట ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీపీసీసీ కార్యదర్శి రాంభూపాల్, కాంగ్రెస్ ప్రతినిధులు పంచరెడ్డి చరణ్, సీనియర్ జర్నలిస్ట్ జమాల్పూర్గణేష్, బీసీ జేఏసీ కన్వీనర్ పోతన్కర్ లక్ష్మీనారాయణ, మాజీ జడ్పీ ఛైర్మర్ దాదన్నగారి విఠల్రావు, పీడీఎస్యూ ప్రతినిధి సుధాకర్, ఎనుగందుల మురళి, సీపీఐ ప్రతినిధి సుధాకర్, ఓమయ్య, ఏఐఎస్ఎఫ్ రఘురాం, యెండల ప్రదీప్, బీజేపీ ప్రతినిధులు స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ డిపో ఎదుట బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న నాయకులు
నిజామాబాద్ నగరంలో మూసిఉన్న ఆర్టీసీ డిపో
నగరంలో ఓ స్కూల్ బస్సును నిలిపివేసి బీసీ బంద్ విషయాన్ని వివరిస్తున్న ఆల్పార్టీ ప్రతినిధులు
నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో నిలిచిపోయిన బస్సులు
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ
ఇందల్వాయిలో అన్నిపార్టీల ఆధ్వర్యంలో నిరసన
కోటగిరిలో..