అక్షరటుడే, వెబ్డెస్క్ : Basara IIIT Student | నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ (IIIT)లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న వసంత అనే విద్యార్థి బుధవారం హాస్టల్లో ఉరి వేసుకుంది.
మిగతా విద్యార్థులు క్లాస్లకు వెళ్లగా వసంత ఒంటరిగా హాస్టల్లో ఉంది. అనంతరం ఆమె ఉరి వేసుకొని తనువు చాలిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమె స్వస్థలం వనపర్తి (Wanaparthy) జిల్లాగా గుర్తించారు. వసంత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఆస్పత్రి (Bhainsa Hospital)కి తరలించారు. కాగా క్యాంపస్లో తరచూ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో సైతం పలువురు విద్యార్థులు తనువు చాలించారు.
Basara IIIT Student | ప్రేమ వ్యవహారమేనా..
వసంత ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమని తెలుస్తోంది. ఆమె గణేశ్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. అయితే అతడు ఇటీవల తన స్వగ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం కావడంతోనే వసంత సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. అయితే వసంత ఆత్మహత్యకు కారణాలపై స్పష్టత ఇవ్వాలంటూ స్టూడెంట్స్ ఆందోళన చేశారు. వీసీ చాంబర్ను ముట్టడించారు. దీంతో క్యాంపస్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
