Homeజిల్లాలుకామారెడ్డిAlumni Friends | మానవత్వం చాటిన బాన్సువాడ ప్రభుత్వ ఉపాధ్యాయులు

Alumni Friends | మానవత్వం చాటిన బాన్సువాడ ప్రభుత్వ ఉపాధ్యాయులు

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Alumni Friends | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో విధులకు వెళ్తున్న క్రమంలో ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ (MIS Coordinator) రాజేష్ జూన్ 30న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబానికి ఆర్థికసాయం చేసేందుకు బాన్సువాడ ఉపాధ్యాయులు (Banswada Teachers) ముందుకొచ్చారు.

ఉపాధ్యాయులంతా కలిసి వాట్సాప్ గ్రూప్​లో (WhatsApp group) ఆర్థికసాయం అందించే విషయాన్ని పోస్ట్​ చేశారు. 24 గంటల్లో 90 మంది ఉపాధ్యాయులు దీనికి స్పందించారు. రూ. 51,073 జమ చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంకంపాలెంకు (Ankampalem) మండల విద్యాధికారి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు మంద ప్రవీణ్, దాసరి రవీందర్, నాగార్జున్, ఏంఐఎస్ కో-ఆర్డినేటర్ భాను ప్రసాద్ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. రాజేష్ కుమారుడి పేరిట పోస్టాఫీస్​లో ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేసి పత్రాలు అందజేశారు.

Read all the Latest News on Aksharatoday.in