అక్షరటుడే, డిచ్పల్లి: Banjara Seva Sangham | బంజారాలు ఐక్యమత్యంతో ఉంటూ అన్నిరంగాల్లో రాణించాలని, ఆల్ ఇండియా బంజార సేవ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఉమేష్ జాదవ్(Former MP Umesh Jadhav) అన్నారు.
బర్ధిపూర్ శివారులోని బృందావనం గార్డెన్(Bardhipur Brindavanam Garden)లో ఆదివారం నిర్వహించిన బంజారా ఆత్మీయ సమ్మేళనం ఆయన మాట్లాడారు. కర్ణాటక, మహారాష్ట్రలలో ముగ్గురు బంజారాలకు మంత్రి పదవులు ఇచ్చారని, కానీ తెలంగాణలో కేటాయించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బంజారాల జనాభాకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు టికెట్లను కేటాయించాలని కోరారు.
AIBSS రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్(Former MLC Ramulu Nayak) మాట్లాడుతూ.. తాను గత ప్రభుత్వంతో కొట్లాడి తండాలను గ్రామ పంచాయతీలుగా చేయించానన్నారు. బంజారాలు సేవాలాల్ మహారాజ్, చరిత్ర తెలుసుకోవాలని అయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) అత్యధిక స్థానాలలో బంజారాలు గెలవాలన్నారు. తండాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 33 జిల్లాల AIBSS అధ్యక్షులు, నిజామాబాద్ జిల్లా బంజార ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.