HomeతెలంగాణKTR defamation case | KTR పరువు నష్టం కేసుపై బండి సంజయ్ రియాక్షన్.. ఆయన...

KTR defamation case | KTR పరువు నష్టం కేసుపై బండి సంజయ్ రియాక్షన్.. ఆయన సంగతేమిటో త్వరలో బయటపెడతా!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: KTR defamation case కేంద్ర మంత్రి బండి సంజయ్​పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ BRS Working President KTR పరువు నష్టం దావా వేశారు.​ ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి నిరాధార ఆరోపణలు చేశారనేది కేటీఆర్ వాదన.

ఈ మేరకు రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈమేరకు పరువు నష్టం దావా కేసుపై బండి Union Minister Bandi Sanjay స్పందించారు.

కరీంనగర్​లో సోమవారం (సెప్టెంబరు 15) మీడియాతో బండి సంజయ్​ మాట్లాడారు. పరువు నష్టం దావా కేసుతో కేటీఆర్ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బండి పేర్కొన్నారు.

కేటీఆర్ వేసిన కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటానని బండి సంజయ్​ చెప్పారు. గతంలో తొమ్మిది సార్లు జైలుకు వెళ్ళి వచ్చానని బండి తెలిపారు. తనపై వందకు పైగా కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ఇలాంటి ఉడత ఊపులకు భయపడేది స్పష్టం చేశారు. తాను లవంగం తింటే తంబాకు తిన్నానని కేటీఆర్​ అన్నారని, తలుచుకుంటే తాను కూడా పరువు నష్టం దావా కేసులు వేయొచ్చన్నారు.

కానీ తాను రాజకీయంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. ఇలా పరువు నష్టం దావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేయనన్నారు.

తెలంగాణలో భారాస ప్రభుత్వ హయాంలో ఫోన్​లు ట్యాప్ జరగకపోతే.. కుటుంబ సభ్యులతో సహా దేవుడి సన్నిధికి రావాలని సవాల్ విసిరానని గుర్తుచేశారు.

మరీ కేటీఆర్ ఎందుకు రావడం లేదని బండి సంజయ్​ ప్రశ్నించారు. అమెరికాలో కేటీఆర్ ఎవరెవరిని కలిశారో.. కేటీఆర్​ సంగతి ఏమిటో త్వరలో బయటపెడతానని బండి సంజయ్ అన్నారు.

KTR defamation case | ఏమిటీ కేసు..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజజ్​పై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోర్టుకెక్కారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టులో ఉండగానే.. తనపై నిరాధార ఆరోపణలు చేశారని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు Hyderabad City Civil Court లో దావా దాఖలు చేశారు.

బండి సంజయ్​ Union Minister Bandi Sanjay పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. కాగా, ఈ పిటిషన్​పై విచారణను కోర్టు డిసెంబరు 15, 2025కి వాయిదా వేసింది.

Must Read
Related News