HomeతెలంగాణPhone Tapping | బండి సంజయ్​ క్షమాపణ చెప్పాలి.. లేకపోతే లీగల్​ నోటీసులు పంపిస్తా :...

Phone Tapping | బండి సంజయ్​ క్షమాపణ చెప్పాలి.. లేకపోతే లీగల్​ నోటీసులు పంపిస్తా : కేటీఆర్​

- Advertisement -

అక్షరటుటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping | కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ​ (Bandi Sanjay) మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ సవాల్​ విసిరారు. ఫోన్​ ట్యాపింగ్​ కేసులో శుక్రవారం బండి సంజయ్​ సిట్ (SIT)​ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆయన ఫోన్​ ట్యాపింగ్​ గురికావడంతో అధికారులు స్టేట్​మెంట్​ రికార్డు చేశారు. విచారణ అనంతరం బండి సంజయ్​ మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ (KCR)​ తన తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్​ చేశారన్నారు. ఈ క్రమంలో బండి సంజయ్​ వ్యాఖ్యలపై కేటీఆర్​ స్పందించారు. ఎక్స్​ వేదికగా ఆయనకు సవాల్​ విసిరారు.

Phone Tapping | ఆరోపణలు నిరూపించాలి

ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆరోపణలు నిరూపించాలని కేటీఆర్​ సవాల్​ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కామెంట్స్‌ హద్దు మీరాయన్నారు. 48 గంటల్లో తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. లేదంటే లీగల్‌ నోటీసు (Legal Notice) పంపిస్తానని హెచ్చరించారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ బండి సంజయ్‌కు తెలివితేటలు ఎలా పనిచేస్తాయో అర్థం కావడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు కనీస జ్ఞానం కూడా లేదన్నారు.

Phone Tapping | సిట్​ దూకుడు

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో సిట్​ దూకుడు పెంచింది. ఇప్పటికే నిందితులను విచారిస్తున్న అధికారులు.. మరోవైపు బాధితుల స్టేట్​మెంట్​ రికార్డు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం బండి సంజయ్​ కూడా ఫోన్​ ట్యాపింగ్​కు సంబంధించిన తన వద్ద ఉన్న ఆధారాలను సిట్​కు అప్పగించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్​ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావును అరెస్ట్​ చేయాలని సిట్​ భావిస్తోంది. ఆయనను అరెస్ట్​ చేయకుండా గతంలో సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సిట్​ అధికారులు ఆ ఆదేశాలు నిలిపి వేయాలని కోర్టును ఆశ్రయించారు.

Must Read
Related News