HomeతెలంగాణHyderabad | హైదరాబాద్‌లో పటాకులు కాల్చడంపై నిషేధం

Hyderabad | హైదరాబాద్‌లో పటాకులు కాల్చడంపై నిషేధం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్​ పోలీసులు (hyderabad police) కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్​, సికింద్రాబాద్​ జంట నగరాల్లో పటాకులు కాల్చడంపై నిషేధం(ban on crackers) విధించారు. ఈ మేరకు హైదరాబాద్​ సీపీ సీవీ ఆనంద్​ (CP cv anand) ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా హై అలర్ట్​ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సైనిక కంటోన్మెంట్​ ప్రాంతాల్లో బాణాసంచా కాల్చొద్దన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పటాకులు పేలితే ప్రజలు ఉగ్రవాదుల దాడి అనుకొని భయపడే అవకాశం ఉందన్నారు. అంతేగాకుండా అపార్థాలకు కూడా దారి తీసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు పటాకులు కాల్చకుండా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఉత్తర్వులు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటాయన్నారు.