Almont Kid syrup | తల్లిదండ్రులకు అలెర్ట్​.. ఆల్మాంట్ కిడ్ సిరప్‌పై నిషేధం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Almont Kid syrup | తెలంగాణ ప్రభుత్వం ఆల్మాంట్ కిడ్ సిరప్‌పై (Almont Kid syrup) నిషేధం విధించింది. ఈ మేరకు ఔషధ నియంత్రణ పరిపాలన డెరెక్టర్​ జనరల్ షానవాజ్ ఖాసిం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆల్మాంట్ కిడ్ సిరప్‌ వినియోగించడం ఆపాలని ప్రభుత్వం పేర్ఒకంది. అందులో ఇథిలీన్ గ్లైకాల్ కల్తీ అయినట్లు గుర్తించింది. ఈ సిరప్ అత్యంత విషపూరితమైన పదార్థం అయిన ఇథిలీన్ గ్లైకాల్ (EG) తో కల్తీ చేయబడిందని ప్రభుత్వం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Almont Kid syrup | తెలంగాణ ప్రభుత్వం ఆల్మాంట్ కిడ్ సిరప్‌పై (Almont Kid syrup) నిషేధం విధించింది. ఈ మేరకు ఔషధ నియంత్రణ పరిపాలన డెరెక్టర్​ జనరల్ షానవాజ్ ఖాసిం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆల్మాంట్ కిడ్ సిరప్‌ వినియోగించడం ఆపాలని ప్రభుత్వం పేర్ఒకంది. అందులో ఇథిలీన్ గ్లైకాల్ కల్తీ అయినట్లు గుర్తించింది. ఈ సిరప్ అత్యంత విషపూరితమైన పదార్థం అయిన ఇథిలీన్ గ్లైకాల్ (EG) తో కల్తీ చేయబడిందని ప్రభుత్వం పేర్కొంది. కోల్‌కతాలోని ఈస్ట్ జోన్‌లోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నుంచి తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌కు (Telangana Drugs Control Administration) ఈ మేరకు సమాచారం అందింది. దీంతో ఆల్మాంట్-కిడ్ సిరప్ (లెవోసెటిరిజైన్ డైహైడ్రోక్లోరైడ్ మరియు మోంటెలుకాస్ట్ సోడియం సిరప్)ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Almont Kid syrup | అప్రమత్తం చేయాలి

బీహార్​కు (Bihar) చెందిన ట్రిడస్ రెమెడీస్ కంపెనీ ఈ సిరప్​ను తయారు చేస్తోంది. ఆల్మాంట్​ సిరప్‌ను కలిగి ఉంటే వెంటనే వాడకాన్ని ఆపివేయాలని, సమీపంలోని డ్రగ్స్ కంట్రోల్ అథారిటీకి నివేదించాలని ప్రభుత్వం సూచించింది. ప్రజలు ఈ ఉత్పత్తిని కలిగి ఉన్న విషయాన్ని నేరుగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌కు టోల్-ఫ్రీ నంబర్: 1800-599-6969 ద్వారా నివేదించవచ్చని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు అన్ని రిటైలర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, పంపిణీదారులు, ఆసుపత్రులను వెంటనే అప్రమత్తం చేయాలని ఆదేశించింది. బ్యాచ్ నంబర్ AL-24002కు చెందిన సిరప్​ స్టాక్​ ఉంటే వెంటనే సీజ్​ చేయాలని సూచించింది.

Related articles

Holi Special Trains | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. హోలీకి ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 1,244 ట్రిప్పులు వేసినట్లు పేర్కొంది.

Turmeric Farmers Protest | నిజామాబాద్​ మార్కెట్​ యార్డ్​లో పసుపు రైతుల ఆందోళన

నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు గురువారం ఆందోళన నిర్వహించారు. పసుపు కొనుగోలులో జాప్యం జరుగుతుందంటూ కార్యాలయాన్ని ముట్టడించారు.

Exam Center Security | పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ రాజేష్ చంద్ర

పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

TTD Digital Offerings | తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కొత్త నిర్ణయం.. ‘శ్రీవారి ముడుపు పత్రం’తో డిజిటల్ కానుకల సౌకర్యం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు డిజిటల్ రూపంలో హుండీ కానుకలు సమర్పించేందుకు టీటీడీ ‘శ్రీవారి ముడుపు పత్రం’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించి ప్రత్యేక పత్రాన్ని హుండీలో వేయే సౌకర్యం కల్పించనుంది.