అక్షరటుడే, బాల్కొండ : Balkonda | కళా ఉత్సవ్ (Kala Utsav) జిల్లాస్థాయి పోటీల్లో బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారని ఎంఈవో బట్టు రాజేశ్వర్ (MEO Battu Rajeshwar) తెలిపారు. ఈ మేరకు శనివారం పాఠశాలలో విద్యార్థులను అభినందించారు.
పదో తరగతి విద్యార్థిని సాయిశివాని వీరనారి ఝాన్నీ లక్ష్మీబాయి వేషధారణలో ఏకపాత్రాభినయం వేసి జిల్లా స్థాయిలో మూడోస్థానంలో నిలిచారు. అలాగే పాటల విభాగంలో కశ్మీర్పై విద్యార్థులు రిమ్షా సుబుర్ ఆఫీజాఖానం, మహేక్ కౌసర్, ఆయేషా ఖానం కలిసి పాట పాడి మూడోస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలభవన్లో నిర్వహించిన కళా ఉత్సవ్ – 2025 పోటీల్లో బాల్కొండ (Balkonda) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి హెచ్ఎం ప్రశాంత్కుమార్, గైడ్ టీచర్ కవితా రాణి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.