అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Town | పట్టణంలోని బగలాముఖి పీఠంలో (Bagalamukhi Peetham) మంగళవారం అమ్మవారి జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు పీఠాధిపతి క్రాంతి పటేల్ తెలిపారు. ఉదయం విశేష అభిషేకాలు నిర్వహించామని.. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారని ఆయన వివరించారు.