Homeతాజావార్తలుAzharuddin | మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్​

Azharuddin | మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్​

భారత మాజీ క్రికెటర్​, మాజీ ఎంపీ అజారుద్దీన్​ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్​భవన్​లో శుక్రవారం ఆయన చేత గవర్నర్​ ప్రమాణం చేయించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Azharuddin | కాంగ్రెస్​ నాయకుడు, భారత మాజీ క్రికెటర్​ అజారుద్దీన్​ (Azharuddin) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం గవర్నర్​ జిష్ణుదేవ్​వర్మ (Governor Jishnu Dev Verma) ఆయనతో ప్రమాణం చేయించారు.

అజారుద్దీన్​ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్​ నుంచి కాంగ్రెస్​ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ గెలిచిన మాగంటి గోపినాథ్​ (Maganti Gopinath) మృతితో ఉప ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. కాంగ్రెస్​ మాత్రం ఆయనను గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఈ నియామకానికి గవర్నర్​ ఇంకా ఆమోదం తెలుపలేదు. అయితే జూబ్లీహిల్స్​లో (Jubilee Hills) భారీగా ముస్లిం ఓట్లు ఉండటంతో కాంగ్రెస్​ తాజాగా.. మైనార్టీ కోటాలో అజారుద్దీన్​కు మంత్రి పదవి ఇచ్చింది. దీంతో ఆయన ప్రమాణం చేశారు.

ప్రమాణ స్వీకారానికి ముందు సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆయనకు ఫోన్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఎన్నికల కోడ్​ అమలులో ఉండగా.. మంత్రివర్గ విస్తరణ చేపట్టడంపై బీజేపీ ఇప్పటికే ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేసింది.

Azharuddin | అజారుద్దీన్​ నేపథ్యం

మహమ్మద్​ అజారుద్దీన్​ హైదరాబాద్​లో (Hyderabad) జన్మించాడు. భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా పని చేశాడు. ఇండియా తరఫున 99 టెస్ట్ మ్యాచ్‌లు, 334 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. మ్యాచ్​ ఫిక్సింగ్​ ఆరోపణలతో బీసీసీఐ అతడిపై జీవిత కాల సస్పెన్షన్​ విధించింది. దీంతో 2000లో అతని క్రికెట్ కెరీర్ ముగిసింది. అయితే నిషేధంపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. 2012లో జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసింది. క్రికెట్​ నుంచి తప్పుకున్న తర్వాత అజారుద్దీన్​ కాంగ్రెస్​ పార్టీలో (Congress party) చేరారు. 2009లో యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో రాజస్థాన్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్​ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల వేళ అనూహ్యంగా మంత్రిగా ప్రమాణం చేశారు.