Sabarimala | శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు.. సరైన ఏర్పాట్లు లేక అవస్థలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sabarimala | శబరిమల అయ్యప్ప (Ayyappa) స్వామి ఆలయం ఆదివారం సాయంత్రం తెరుచుకున్న విషయం తెలిసిందే. మకర విళక్కు సీజన్లో భాగంగా సోమవారం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆలయం తెరుచుకోవడంతో వేల సంఖ్యలో స్వామి దర్శనానికి పోటెత్తారు. ఆదివారం ప్రారంభమైన మండల పూజ సీజన్ డిసెంబర్ 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. ఈ క్రమంలో మంగళవారం భక్తులు అధిక […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sabarimala | శబరిమల అయ్యప్ప (Ayyappa) స్వామి ఆలయం ఆదివారం సాయంత్రం తెరుచుకున్న విషయం తెలిసిందే. మకర విళక్కు సీజన్లో భాగంగా సోమవారం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.

అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆలయం తెరుచుకోవడంతో వేల సంఖ్యలో స్వామి దర్శనానికి పోటెత్తారు. ఆదివారం ప్రారంభమైన మండల పూజ సీజన్ డిసెంబర్ 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. ఈ క్రమంలో మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. దీంతో క్యూలైన్లలో వారు పడిగాపులు కాస్తున్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Sabarimala | ప్రారంభంలోనే..

శబరిమల వద్ద రెండు నెలల పాటు జరిగే మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ అల్లకల్లోలంగా ప్రారంభమైంది. రద్దీ నిర్వహణ లోపం, ప్రాథమిక సౌకర్యాల వైఫల్యం, తగినంత పరిపాలనా సంసిద్ధత లేకపోవడం వంటి ఆందోళనలు పెరుగుతున్నాయి. భారీ సంఖ్యలో యాత్రికుల రద్దీని నిర్వహించడానికి, మధ్యాహ్నం సెషన్‌ను రెండు గంటలు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆలయానికి దాదాపు రెండు లక్షల మంది భక్తులు వచ్చారని అంచనా.

ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు జయకుమార్ ఏర్పాట్లు సరిపోలేదని అంగీకరించారు. తాగునీటి పాయింట్ల కొరత, సరిగా నిర్వహించబడని బయో-టాయిలెట్లు, తగినంత ఆహార సరఫరా లేదని ఆయన ఎత్తిచూపారు. రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వారాంతాలు, పండుగ రోజుల్లు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...