ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిAuto Drivers Rally | 'ఆటో ఆకలి కేకలు’ మహాసభను సక్సెస్​ చేయాలి

    Auto Drivers Rally | ‘ఆటో ఆకలి కేకలు’ మహాసభను సక్సెస్​ చేయాలి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​:Auto Drivers Rally | హైదరాబాద్​(Hyderabad)లో వచ్చేనెల 27న నిర్వహించనున్న ‘ఆటో ఆకలి కేకలు’ మహాసభను సక్సెస్​ చేయాలని రాష్ట్ర ఆటో యూనియన్​ జేఏసీ అధ్యక్షుడు మంద రవికుమార్(Manda Ravikumar)​ పిలుపునిచ్చారు. నిజాంసాగర్​లో శనివారం ఆటో రథయాత్ర(Auto Rath Yatra) నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈనెల​ 25న మెదక్​లోని నర్సాపూర్​ నుంచి రథయాత్ర ప్రారంభమైందని.. 27న హైదరాబాద్​ చేరుకుంటుందన్నారు. అదేరోజు ఇందిరా పార్క్​లో అమరవీరుల ప్రాంగణం వద్ద మహాసభ ఉంటుందని స్పష్టం చేశారు.

    ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme)తో ఆటోవాలాలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఆటోడ్రైవర్లు(Auto Drivers) ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. మృతిచెందిన ఆటో డ్రైవర్లకు రూ. 25 లక్షలు నష్టపరిహారం(Compensation) ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సాయిలు, నిజాంసాగర్ మండల ఆటో యూనియన్ సభ్యులు కైసర్ కుర్షిద్, నర్సింలు, సతీష్, హమీద్, మక్సూద్​, రఫీక్, రజాక్​తో పాటు పలువురు ఆటోడ్రైవర్లు యూనియన్​ సభ్యులు ఉన్నారు.

    More like this

    Tiruma Temple close | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. రేపు తిరుమల ఆలయం మూసివేత

    అక్షరటుడే, తిరుమల: Tiruma Temple close | భాద్రపద పౌర్ణమి Bhadrapada Pournami రోజున అంటే ఈనెల 7న...

    Muslim owns laddu | వినాయకుడి లడ్డూ సొంతం చేసుకున్న ముస్లిం.. వరుసగా రెండోసారి

    అక్షరటుడే, హైదరాబాద్: Muslim owns laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్​లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Vinayaka Laddu | రికార్డు స్థాయి ధర పలికిన శ్రీ గణేశ్​ మండలి లడ్డూ.. ఏకంగా రూ. 1.65 లక్షల పైనే..

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...