Homeతాజావార్తలుAuto Collision | ఆటో ఢీ.. ఒకరి దుర్మరణం.. అతివేగమే కారణం!

Auto Collision | ఆటో ఢీ.. ఒకరి దుర్మరణం.. అతివేగమే కారణం!

అతివేగంగా వెళ్తున్న ఆటో ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన డిచ్​పల్లి మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి: Auto Collision | ఆటో అతివేగానికి ఓ నిండుప్రాణం బలైంది. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలంలో గురువారం (అక్టోబరు 23) రాత్రి చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్​పల్లి నుంచి ధర్పల్లి (Dharpally) మండలం రామడుగుకు (Ramadugu) ఆటోలో ఆరుగురు వ్యక్తులు బయలుదేరారు.

Auto Collision | అతి వేగమే కారణం..

అయితే డ్రైవరు తలారి గంగాధర్​​ అతివేగంగా ఆటోను నడుపుతూ.. సుద్దపల్లి శివారులో సాంపల్లి గ్రామస్థుడైన అంతరెడ్డి గంగారెడ్డి(60)ని ఢీకొట్టాడు.

దీంతో గంగారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో సైతం బోల్తా పడింది. దీంతో డ్రైవరు​తో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Must Read
Related News