HomeతెలంగాణMallu Ravi | ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం.. ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు

Mallu Ravi | ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం.. ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mallu Ravi | నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్​ఎస్​, టీడీపీ కలిసి కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని(Congress government) కూల్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ మూడు పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడి ప్రజల ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నాయన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజలు కాంగ్రెస్​ వెంటే ఉన్నారన్నారు. కొందరు నాయకులు పగటి కలలు కంటూ.. తప్పుడు ప్రచారాలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు.