అక్షరటుడే, వెబ్డెస్క్ : Harish Rao on SIT | కేసీఆర్ను సిట్ విచారించడంపై మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) స్పందించారు. కేసీఆర్కు నోటీసులు రాజకీయ కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట అని మండి పడ్డారు.
నందినగర్లోని నివాసంలో కేసీఆర్ను (KCR) సిట్ అధికారులు మధ్యాహ్నం 3 గంటల నుంచి విచారిస్తున్న విషయం తెలిసిందే. సిట్ పేరిట ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి జరుగుతోందని హరీశ్రావు ఆరోపించారు. నోటీసుల వెనుక చట్టం లేదు, రాజకీయ ప్రతీకారం, రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అహంకారం మాత్రమే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను బహిరంగంగా ఉల్లంఘించారన్నారు. నోటీసులు ఇవ్వడంలో చట్టపరమైన విధానాలు పాటించలేదన్నారు.
Harish Rao on SIT | దృష్టి మళ్లించేందుకు..
పాలన చేతకాక, హామీలు నెరవేర్చలేక, ప్రజా సమస్యలకు సమాధానం చెప్పలేక ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడమే కాంగ్రెస్ ఏకైక అజెండా అయ్యిందన్నారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, వరుస కుంభకోణంల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో (municipal elections) లబ్ధి పొందవచ్చని సీఎం భావిస్తున్నారని చెప్పారు.
సిట్ స్వతంత్రంగా పని చేయడం లేదని, సీఎం కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలకే పని చేస్తోందన్నారు. వారు ఇచ్చిన నోటీసులు చట్ట బద్దం కావన్నారు. అయినా మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ దర్యాప్తునకు సహకరిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నా.. పోలీసులు ఎందుకు అతి చేస్తున్నారని హరీశ్రావు ప్రశ్నించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేశారన్నారు. గజ్వేల్ నుంచి హైదరాబాద్ దాకా వేలాది మంది పోలీసులను మోహరించారని చెప్పారు. తమ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.