ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ ఈవోపై దాడి

    Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ ఈవోపై దాడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhadrachalam Temple | దేవుడి భూములకు రక్షణ లేకుండా పోయింది. కొందరు ఆలయ భూములను యథేచ్ఛగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అడ్డుకోవడానికి వెళ్తున్న అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా భద్రాచలం ఈవో రమాదేవి(Bhadrachalam EO Ramadevi)పై కొందరు దాడి చేశారు.

    ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)​లోని అల్లూరి జిల్లా పురుషోత్తపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పురుషోత్తపట్నంలో భద్రాచలం రామాలయానికి సంబంధించిన 889.5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని కొందరు ఆక్రమించారు. ఈ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది. ఆ భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇటీవల ఏపీ హైకోర్టు(High Court) తీర్పు చెప్పింది. అయినా ఆక్రమణదారులు మాత్రం నిర్మాణాలు చేపట్టారు.

    Bhadrachalam Temple | మూకుమ్మడిగా దాడి

    పురుషోత్తపట్నం(Purushottapatnam)లోని ఆలయ భూముల్లో నిర్మాణాల విషయం తెలుసుకున్న ఈవో రమాదేవి, సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. నిర్మాణాలను అడ్డుకునే యత్నం చేశారు. అయితే స్థానికులు ఈవోతో పాటు సిబ్బందిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో ఈవో స్పృహ తప్పి పోడిపోయారు. దీంతో సిబ్బంది వెంటనే భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...