Homeతాజావార్తలుRailway Police | ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్​లో అమానుషం.. వాటర్​ బాటిళ్లు విక్రయించే వ్యక్తి దారుణ హత్య

Railway Police | ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్​లో అమానుషం.. వాటర్​ బాటిళ్లు విక్రయించే వ్యక్తి దారుణ హత్య

Railway Police | ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్​లో వాటర్​ బాటిళ్లు విక్రయించే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు నిజామాబాద్​ రైల్వేపోలీసులు జీరో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి నాందేడ్​ జిల్లాకు సమాచారం అందించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Railway Police | ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్​లో (Intercity Express​) దారుణం చోటుచేసుకుంది. ట్రెయిన్​లో వాటర్​ బాటిళ్లు విక్రయించే వ్యక్తి హత్యకు గురయ్యాడు.

రైల్వే ఎస్​హెచ్​వో సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అకోలా నుంచి నిజామాబాద్​ మీదుగా కాచిగూడ(Kachiguda) వెళ్లే ఇంటర్​ సిట్​ ఎక్స్​ప్రెస్​లో ఆదివారం ఉదయం నాందేడ్​ జిల్లా ఉమ్రి గ్రామానికి చెందిన అతిశ అనే వ్యక్తి ఎక్కాడు.

Railway Police | వాటర్ బాటిల్​ విషయంలో గొడవ..

అతడు రైల్లో వాటర్​ బాటిళ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటాడు. అయితే రైలులోని డీ–6 కోచ్​లో వాటర్​ బాటిళ్లు విక్రయిస్తుండగా.. ఉమ్రి గ్రామానికే చెందిన షేక్​ జమీర్​ అనే వ్యక్తితో వాటర్​ బాటిల్​ విషయంలో గొడవ జరిగింది.

ఈ క్రమంలో ఆవేశానికి లోనైన జమీర్​.. అతిశను గాజు గ్లాసు​తో పొడిచి, ​రైలు దిగి పారిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra) లోని కరికెల్లి – ధర్మాబాద్​ మధ్య జరిగింది.

కాగా, ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్​ నిజామాబాద్​కు చేరుకున్నాక.. రైల్వే పోలీసులకు ప్రయాణికులు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే వైద్యులను పిలిపించారు.

వైద్యులు అక్కడికి చేరుకుని బాధితుడిని పరీక్షించగా.. తీవ్ర రక్తస్రావంతో అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోలీసులు జీజీహెచ్​కు తరలించారు. అనంతరం జీరో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి నాందేడ్​కు సమాచారం అందించామని రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.

Must Read
Related News