Homeక్రైంMinarpally | మినార్​పల్లిలో దారుణం.. భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య

Minarpally | మినార్​పల్లిలో దారుణం.. భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య

- Advertisement -

అక్షరటుడే, బోధన్: మండలంలోని మినార్​పల్లిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను భార్య గొంతు కోసి హత్య చేసింది. రూరల్​ ఎస్సై మచ్చేందర్​​ రెడ్డి (Rural Sub-Inspector Machender Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. మినార్​పల్లి గ్రామంలో దేశ్యానాయక్​కు భార్య, కొడుకు ఉన్నారు.

అయితే కుటుంబ కలహాల కారణంగా శుక్రవారం రాత్రి దేశ్యానాయక్​ ఇంట్లో నుంచి అరుపులు వినిపించగా స్థానికులు వెళ్లి పరిశీలించారు. అయితే అప్పటికే దేశ్యానాయక్​ గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతడిని బోధన్​ ప్రభుత్వ ఆస్పత్రికి (Bodhan Government Hospital) తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బోధన్​ రూరల్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్యతో పాటు కుమారుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా.. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.