Homeజిల్లాలుకామారెడ్డిmid-day meal | మధ్యాహ్న భోజనం తిన్న 28 మంది విద్యార్థులకు అస్వస్థత

mid-day meal | మధ్యాహ్న భోజనం తిన్న 28 మంది విద్యార్థులకు అస్వస్థత

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: mid-day meal : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. Primary School మధ్యాహ్న భోజనం mid-day meal తిన్న 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధిత విద్యార్థులను హుటాహుటిన బిచ్కుంద ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

mid-day meal : మాజీ ఎమ్మెల్యే హన్మంత్​ షిండే పరామర్శ

బిచ్కుంద మండలం (Bichkunda Mandal) శెట్లూరు గ్రామ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థులను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించారు.

విషయం తెలుసుకుని హుటాహుటిన బిచ్కుంద ఏరియా ఆసుపత్రికి షిండే చేరుకున్నారు. ఈ ఘటనపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆసుపత్రిలోని వైద్యులతో మాట్లాడారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని హన్మంత్​ షిండే ఈ సందర్భంగా సూచించారు.