HomeతెలంగాణCP Sai chaitanya | ఏటీఎం చోరీ నిందితులను త్వరగా పట్టుకోవాలి

CP Sai chaitanya | ఏటీఎం చోరీ నిందితులను త్వరగా పట్టుకోవాలి

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai chaitanya | నగరంలోని మూడో టౌన్​ పరిధిలో ఏటీఎంలో (ATM) చోరీకి ప్రయత్నించిన నిందితులను త్వరగా పట్టుకోవాలని సీపీ సాయిచైతన్య పోలీసులను ఆదేశించారు.

చోరీయత్నం జరిగిన చంద్రశేఖర్​ కాలనీలోని (Chandrasekhar Colony) బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (bank Of India) ఏటీఎంను సీపీ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏటీఎంల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసులకు సూచించారు. క్లూస్​టీం (Clues Team), సీసీఎస్​ టీం (CCS Team) అధికారులు కేసు పరిశోధనలో అలర్ట్​గా ఉండాలని సీఐ శ్రీనివాస్ రాజు, ఎస్సై హరిబాబుకు ఆదేశాలు జారీ చేశారు.

నగరంలోని చంద్రశేఖర్​ కాలనీలో సోమవారం అర్ధరాత్రి గ్యాస్​కట్టర్​తో ఏటీఎంలో నగదు చోరీ చేసేందుకు దుండగులు ప్రయత్నించిన విషయం విదితమే. ఏటీఎంలో అలర్ట్​ మెసేజ్​ పోలీసులు అందుకుని ఘటనా స్థలానికి చేరుకోగా.. పోలీసుల రాకను గమనించిన దుండగులు వ్యాన్​లో అక్కడి నుంచి ఉడాయించారు. పాల్దా శివారులో వ్యాన్​ను గ్యాస్​ కట్టర్​ను వదిలేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.

Must Read
Related News