Assistant Professors Terminated | మెడికల్ కళాశాలలో ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల తొలగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన డీఎంఈ

నగరంలోని మెడికల్ కళాశాలలో ఏడాదికి పైగా విధులకు గైర్హాజరవుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లపై వైద్యవిధాన పరిషత్​ కొరడా ఝలిపించింది. ఈ సందర్భంగా ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Assistant Professors Terminated | నగరంలోని మెడికల్ కళాశాలలో (Nizamabad Medical College) అసిస్టెంట్ ప్రొఫెసర్లపై వైద్యవిధాన పరిషత్ (DME Orders)​ కొరడా ఝలిపించింది. ఏడాదికి పైగా విధులకు గైర్హాజరవుతున్న ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Assistant Professors Terminated | మెడికల్​ కళాశాలలో..

నగరంలోని మెడికల్​ కళాశాలను 2013లో స్థాపించారు. ఎంబీబీఎస్​లో 120సీట్లు ఉన్నాయి. జనరల్​ మెడిసిన్​, సర్జరీ, పీడియాట్రిక్స్​, అనస్థీషియాలో పీజీ సీట్లు ఉన్నాయి. నీట్​ యూజీ, పీజీ కౌన్సెలింగ్​ ద్వారా ప్రవేశాలు జరుగుతున్నాయి. దీనికి అనుబంధంగా జిల్లా జనరల్​ ఆస్పత్రి(Government General Hospital) ఉంది. జీజీహెచ్​లో రోజుకు 1,500కు తగ్గకుండా ఓపీ పేషెంట్లు వస్తుంటారు. జిల్లా ప్రజలకే కాకుండా మహారాష్ట్ర నుంచి.. ఇతర జిల్లాల నుంచి సైతం రోగులు జీజీహెచ్​కు వైద్యం నిమిత్తం వస్తుంటారు.

నిజామాబాద్​ మెడికల్​ కళాశాలలో..

నిజామాబాద్​ మెడికల్​ కళాశాలలో కొన్నేళ్లుగా కొందరు ప్రొఫెసర్లు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని డీఎంఈకి సమాచారం అందింది. ఈ క్రమంలో అసిస్టెంట్​ ప్రొఫెసర్లు అయేషా ఫరీన్​, స్రవంతి, నిశిత, నీలకంఠం, సతీశ్​రాజు, లక్ష్మణ్​, అపూర్వ, లీలావతిలను తొలగిస్తూ వైద్య విద్య సంచాలకులు నరేంద్ర కుమార్ (Telangana Health Department)​ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

BJP district president Dinesh | దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.. బీజేపీ డిమాండ్​

అమాయకులపై దాడులకు పాల్పడిన ముష్కరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి డిమాండ్​ చేశారు. ఈ మేరకు డీజీపీ శివధర్​రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Godavari Pushkaralu Preparations | గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అధికారులను సూచించారు. ఈ మేరకు కందకుర్తి పుష్కర ఘాట్​ను ఆమె బుధవారం సందర్శించారు.

Basara IIIT Student | బాసర ట్రిపుల్​ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Basara IIIT Student | నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్​ ఐటీ (IIIT)లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంజినీరింగ్​...

KTR on Mallanna Jathara | దైవ దర్శనానికి వెళ్తే దాడి చేస్తారా : కేటీఆర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR on Mallanna Jathara | నాగర్​ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కుమ్మెర మల్లన్న (Kummera Mallanna) జాతరలో...