HomeతెలంగాణElectric shock | విద్యుత్​షాక్​తో అసిస్టెంట్​ లైన్​మన్​ మృతి

Electric shock | విద్యుత్​షాక్​తో అసిస్టెంట్​ లైన్​మన్​ మృతి

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: Electric shock | విద్యుదాఘాతంతో అసిస్టెంట్​ లైన్​మన్ (Assistant Lineman)​ మృతి చెందిన ఘటన బోధన్​ మండలంలోని రాజీవ్​నగర్​ తండాలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడపల్లికి చెందిన మహేందర్​ బోధన్​ మండలంలో అసిస్టెంట్​ లైన్​మన్​గా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా గురువారం ఉదయం రాజీవ్​నగర్​ తండాలోని (Rajivnagar Thanda) కరెంట్​పోల్​ ఎక్కాడు. అయితే కరెంట్​పోల్​పై 11కేవీ వైర్లు ఉండడంతో ప్రమాదవశాత్తు షాక్​కు గురై స్తంభం పైనుంచి కిందపడ్డాడు. వెంటనే స్థానికులు, తోటి సిబ్బంది అతడిని బోధన్​ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిజామాబాద్​ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు.

Must Read
Related News