HomeతెలంగాణAssembly Meeting | 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం కమిషన్​పై చర్చ

Assembly Meeting | 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం కమిషన్​పై చర్చ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assembly Meeting | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది. కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్​లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్​ ప్రభుత్వం జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్(Justice PC Ghosh Commission)​ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్​ సుదీర్ఘంగా విచారణ చేపట్టి జులై 31న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను ఇప్పటికే మంత్రివర్గంలో చర్చించారు. అసెంబ్లీలో చర్చకు పెడతామని గతంలోనే సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Assembly Meeting | ఇరకాటంలో బీఆర్​ఎస్​

కాళేశ్వరం కమిషన్​ నివేదికతో బీఆర్​ఎస్​ ఇరకాటంలో పడింది. కమిషన్​ నివేదికపై కోర్టుకు వెళ్లిన కేసీఆర్​, హరీశ్​రావుకు అక్కడ చుక్కెదురైంది. అసెంబ్లీలో నివేదికపై(Assembly Report)చర్చించడానికి కోర్టు ఓకే చెప్పింది. నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకరించలేదు. ఈ క్రమంలో అసెంబ్లీలో నివేదికను పెట్టి చర్చించడం ద్వారా బీఆర్​ఎస్​పై ఒత్తిడి తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం అక్రమాలకు కేసీఆర్​ కారణమని పీసీ ఘోష్​ కమిషన్​(PC Ghosh Commission) నివేదిక లో పేర్కొన్నారు. దీంతో అసెంబ్లీలో చర్చ పెట్టి బీఆర్​ఎస్​ను కడిగేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

స్థానిక ఎన్నికల వేళ కాళేశ్వరం కమిషన్​ అక్రమాలపై అసెంబ్లీలో చర్చిస్తే బీఆర్​ఎస్​(BRS)కు మైనస్​ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాళేశ్వరం నివేదిక ద్వారా బీఆర్ఎస్​పై వ్యతిరేక వస్తుందని కాంగ్రెస్​ నాయకులు పేర్కొంటున్నారు.

Assembly Meeting | 29న మంత్రివర్గ సమావేశం

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) ఈ నెల 29న జరగనుంది. అనంతరం 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటిరోజు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతికి సంతాపం ప్రకటించనున్నారు. వైస్​ స్పీకర్ ఎన్నిక​, కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై సమావేశాల్లో చర్చించనున్నారు.

Must Read
Related News