అక్షరటుడే, వెబ్డెస్క్ : Brahmaputra River | పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్(Pakistan)తో వాణిజ్యం సహా పలు కీలక ఒప్పందాలు రద్దు చేసుకుంది. ఇందులో భాగంగా సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో సింధూ నది జలాలు పాక్కు వెళ్లకుండా భారత్(India) మళ్లిస్తోంది. దీంతో ఆ దేశం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. ఆ దేశంలో సాగు, తాగునీటి అవసరాలకు సింధూ నది కీలకం. అయితే సింధూ జలాలను ఆపడంతో పాక్కు ఎం చేయాలో తోచక తప్పుడు వార్తలను ప్రచారంలో పెడుతోంది.
భారత్ సింధూ నది(Sindhu River) జలాలు ఆపడంతో భారత్కు చైనా బ్రహ్మపుత్ర నది(Brahmaputra River) జలాలను ఆపుతుందని ఇటీవల పాక్ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తమ మిత్రదేశం చైనా బ్రహ్మపుత్ర నది నీటిని ఆపితే భారత్ ఇబ్బందులు పడుతుందని పాక్ భావిస్తోంది. అయితే దీనికి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ(Assam CM Himanta Biswas Sharma) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. చైనా నుంచి కాకుండా బ్రహ్మపుత్ర నదికి భారత్లోని ఉపనదుల ద్వారానే అధిక వరద వస్తోందని ఆయన తెలిపారు. చైనా నీటిని ఆపినా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.
చైనా నుంచి 30-35శాతం జలాలు మాత్రమే వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇక మిగిలిన వరద అంతా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయాలో రుతుపవనాల వల్ల కురిసే వర్షాలతో చేరుతుందని ఆయన వివరించారు. బ్రహ్మపుత్ర(Brahmaputra) జలాల కోసం భారత్ ఎగువ నుంచి వచ్చే ప్రవాహం కోసం ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అది వర్షాధారిత భారత నది అని పేర్కొన్నారు. ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే అది భారత్కే మేలు చేస్తుందన్నారు. దీంతో అస్సాంలో ఏటా వచ్చే వరదలు తగ్గిపోతాయన్నారు.
సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ వైస్ ప్రెసిడెంట్ విక్టర్ జికాయ్ గావ్(Victor Jikai Gaon) ఇటీవల భారత్ సింధూజలాలను నిలిపివేయడంపై స్పందిస్తూ.. బ్రహ్మపుత్ర నది నుంచి నీరు భారత్కు వెళ్లకుండా చైనా(China) ఆపగలదని పేర్కొన్నాడు. ఈ అంశాన్ని పాక్ మీడియా ప్రచారంలోకి తెచ్చింది. అయితే అధికారికంగా చైనా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.