Homeజిల్లాలునిజామాబాద్​ASI Suresh | ఏఎస్సై సురేష్​కు ఉత్తమ రచన పురస్కారం

ASI Suresh | ఏఎస్సై సురేష్​కు ఉత్తమ రచన పురస్కారం

ముప్కాల్​ మండలం ఏఎస్సై తొగర్ల సురేష్​కు ఉత్తమ రచన పురస్కారం లభించింది. ఆయన రచించిన వెన్నెల్లో మాపల్లె పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది.

- Advertisement -

అక్షరటుడే, మెండోరా: ASI Suresh | ముప్కాల్ మండల కేంద్రంలో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ప్రముఖ రచయిత తొగర్ల సురేష్​కు (Asi Togarla Suresh) ఉత్తమ రచన పురస్కారం దక్కింది. శ్రీవాణి సాహిత్య పరిషత్ (Srivani Sahitya Parishad) సిద్దిపేట ఆధ్వర్యంలో వచ్చే నవంబర్​లో తొగర్ల సురేష్​కు ఉత్తమ రచన పురస్కారం అందజేయనున్నారు.

ASI Suresh | వెన్నెల్లో మాపల్లె పుస్తకం..

ఏఎస్సై తొగర్ల సురేష్​ ‘వెన్నెల్లో మా పల్లె’ (vennello maa palle) అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకానికి ఉత్తమ రచన పురస్కారం రావడంపై పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముప్కాల్ (Mupkal) గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కట్ట మహేష్ యాదవ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఏఎస్సై సురేష్​ మరెన్నో పుస్తకాలను రచించి ప్రముఖుల స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.

‘వెన్నెల్లో మా పల్లె’ పుస్తకంలో తను చిన్నప్పుడు నందిపేట్ మండలం కుద్వాన్​పూర్ గ్రామంలో విద్యనభ్యసించిన జ్ఞాపకాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. కాగా.. ఈ పుస్తకానికి ఉత్తమ రచన పురస్కారం లభించడంపై సహోద్యోగులు, బంధువులు అభినందనలు తెలిపారు.