అక్షర టుడే, దుండిగల్: Dundigal | హైదరాబాద్ దుండిగల్ (Dundigal) అవధూత శ్రీ దత్తపీఠంలో నాగమండల పూజ, ఆశ్లేష పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుండి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి, శేష నాగేంద్ర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించి ఆశ్లేష బలి, కాలసర్ప దోష నివారణ పూజలుచేశారు.
కాలసర్పంలో ‘కాల’ అంటే కాలం అని, ‘సర్పం’ అంటే పాము అని అర్థం. కాలసర్పము అనగా కాలం సర్పముగా మారి ఆలయ పూజారి సుధీర్ శర్మ తెలిపారు. మానవుడిని అనేక రకాల కష్టాలపాలు చేయడాన్నే కాలసర్పయోగం లేదా కాలసర్పదోషం అని అంటారని వివరించారు. జన్మకుండలిలో (జాతకచక్రంలో) రాహువు, కేతువు (Rahu and Ketu) వల్ల కాలసర్పదోషం ఏర్పడుతుందని తెలియపర్చారు. కాలసర్పయోగం ఉన్నవారు తమతమ వృత్తులలో పైకి రావడానికి ఎంతో అధికమైన శ్రమపడాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు ఎంతటి అధికమైన శ్రమ అనుభవించినా, ఆ శ్రమకు తగిన ఫలితం కనిపించదని ఆయన వివరించారు.
Dundigal | దోషాలు తొలగించేందుకు..
భక్తులకు ఉండేటువంటి సమస్యలు, కుజదోషాలు సర్ప దోషాలు, నాగదోషాలు, కాలసర్ప దోషాలు వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవాలంటే అశ్లేషబలి పూజల్లో పాల్గొంటే సత్ఫలితాలు వస్తాయని పంతులు సుధీర్వర్మ వివరించారు. అలాగే సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు, రుణ, రోగ బాధలు, కోర్టు కేసులు అన్ని తొలగిపోవాలని భక్తులందరికీ సకల సుఖ భోగాలు కలగాలని సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలకు చుట్టు ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.