HomeతెలంగాణJubilee Hills by-election | జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్​కు మద్దతు తెలిసిన అసదుద్దీన్​ ఒవైసీ

Jubilee Hills by-election | జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్​కు మద్దతు తెలిసిన అసదుద్దీన్​ ఒవైసీ

Jubilee Hills by-election | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్​ ఒవైసీ తెలిపారు. కాంగ్రెస్​ అభ్యర్థికి ఆయన మద్దతు ప్రకటించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills by-election | ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్​ ఒవైసీ (Asaduddin Owaisi) జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​యాదవ్​కు మద్దతు తెలిపారు. కాంగ్రెస్​ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

జూబ్లీహిల్స్​ కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్ (Naveen Yadav)​ శుక్రవారం నామినేషన్​ దాఖలు చేశారు. ర్యాలీగా వెళ్లి ఆయన మొదటి సెట్​ నామినేషన్​ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్​, వివేక్​ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా షేక్​పేట్ ఆర్ఓ కార్యాలయం సమీపంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని నవీన్ యాదవ్ కలిశారు. ఒవైసీ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్లాలని ఆయనకు సూచించారు.

Jubilee Hills by-election | బీఆర్​ఎస్​ విఫలం

ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ మాట్లాడుతూ.. బీఆర్​ఎస్ (BRS)​ పదేళ్ల పాలనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం, ఎమ్మెల్యే జూబ్లీహిల్స్​లో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. తాము జూబ్లీహిల్స్​లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు 37 శాతం ఓట్లు వచ్చాయని, పార్లమెంట్​ ఎన్నికల్లో 15 శాతానికి పడిపోయాయన్నారు. బీఆర్​ఎస్​ ఓట్లు బీజేపీకి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను ఆపాలని ఒవైసీ అన్నారు.

Jubilee Hills by-election | బీజేపీ ఆరోపణల వేళ..

జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్​ తరఫున ఎంఐఎం అభ్యర్థి పోటీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు (BJP President) రామచందర్​రావు ఇటీవల ఆరోపించారు. ఈ క్రమంలో నవీన్​ యాదవ్​కు ఒవైసీ మద్దతు తెలపడం గమనార్హం. కాగా నవీన్​ యాదవ్​ తన రాజకీయ జీవితాన్ని ఎంఐఎంతో ఆరభించారు. 2014లో జూబ్లీహిల్స్​లో ఎంఐఎం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఈ క్రమంలో తాజాగా ఎంఐఎం అధినేత ఆయనకు మద్దతు తెలపడం గమనార్హం.

Jubilee Hills by-election | ప్రజాభిప్రాయం మేరకే..

నామినేషన్ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ ఓట్ చోరీ పేరిట ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. తాము రెండేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పి ఓట్లు అడుగుతామన్నారు. ప్రజాభిప్రాయం మేరకే నవీన్ యాదవ్​కు టికెట్ అధిష్టానం టికెట్​ కేటాయించిందని చెప్పారు. నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. తనకుకు టికెట్ ఇచ్చిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.