అక్షరటుడే, ఇందూరు: Village Administration Officers | గ్రామ పాలన అధికారుల నియామకం కోసం ఈనెల 25న జరిగే రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar) సూచించారు. ఈ మేరకు శుక్రవారం తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 330 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Giriraj Government Degree College) పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. ఆలస్యంగా వచ్చేవారిని లోనికి అనుమతించబడమని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీవో రాజేంద్ర కుమార్ nizamabad Rdo rajendra kumar, జిల్లా రవాణా అధికారి ఉమామహేశ్వరరావు dto uma Maheswara rao, ఎంవీఐ కిరణ్ కుమార్ mvi kiran kumar, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి acp raja venkat reddy, వెంకటేశ్వర్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, తహశీల్దార్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.