అక్షర టుడే, ఆర్మూర్ : Minister Tummala | కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి (Vinay Reddy ), ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్ మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును (Minister Tummala Nageswara Rao) కలిశారు.
హైదరాబాద్లోని (Hyderabad) ఆయన కార్యాలయంలో ఈ మేరకు మర్యాద పూర్వకంగా కలిసి, నియోజకవర్గ సమస్యలపై వివరించారు. కాగా, రైతులకు యూరియా పంపిణీపై మంత్రి వివరాలు అడిగినట్లు పేర్కొన్నారు. రైతులకు సరిపడా ఇస్తున్నామని మంత్రికి వివరించినట్లు వెల్లడించారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు పండిత్ పవన్, ముల్లంగి అశోక్ ఉన్నారు.