అక్షరటుడే, వెబ్డెస్క్ : Special Officers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పది జిల్లాలకు ఐఏఎస్ (IAS) ఆఫీసర్లను ప్రత్యేకాధికారులుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రాజీవ్గాంధీ హనుమంతును స్పెషల్ ఆఫీసర్గా నియమించింది. ఆదిలాబాద్కు హరికిరణ్, నల్గొండకు అనితా రామచంద్రన్, రంగారెడ్డికి డి దివ్య, కరీంనగర్కు సర్ఫరాజ్ అహ్మద్, మహబూబ్నగర్కు రవి, వరంగల్ జిల్లాకు కె శశాంక, మెదక్కు ఎ శరత్, ఖమ్మం జిల్లాకు కె సురేంద్ర మోహన్ను నియమించింది. హైదరాబాద్కు ఇలంబర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
