HomeతెలంగాణPCC Chief Mahesh Goud | కాంగ్రెస్​ ఉమ్మడి జిల్లాల ఇన్​ఛార్జీల నియామకం

PCC Chief Mahesh Goud | కాంగ్రెస్​ ఉమ్మడి జిల్లాల ఇన్​ఛార్జీల నియామకం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: PCC Chief Mahesh Goud | కాంగ్రెస్​ ఉమ్మడి జిల్లాల ఇన్​ఛార్జీలను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​గౌడ్ (PCC Chief Mahesh Goud)​ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సంస్థగత నిర్మాణంలో భాగంగా వీరిని నియమించారు. ఖమ్మం ఇన్​ఛార్జీగా వంశీచంద్‌రెడ్డి, నల్గొండ సంపత్‌కుమార్, మెదక్ పొన్నం ప్రభాకర్‌, వరంగల్‌ అడ్లూరి లక్ష్మణ్‌, హైదరాబాద్‌ జగ్గారెడ్డి, రంగారెడ్డి శివసేనారెడ్డి, ఆదిలాబాద్‌-అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కరీంనగర్‌ అద్దంకి దయాకర్, మహబూబ్‌నగర్‌ కుసుమ కుమార్‌, నిజామాబాద్​కు అజ్మత్‌ హుస్సేన్ ఇన్​ఛార్జీలుగా నియమితులయ్యారు.

రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు(Local Elections) జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయాలని కాంగ్రెస్​(Congress) భావిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉమ్మడి జిల్లాలకు ఇన్​ఛార్జీలను(Incharges) నియమించారు. వీరు ఆయా జిల్లాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలపై ఫోకస్​ పెట్టనున్నారు. కొత్తగా ఇన్​ఛార్జీలుగా నియమితులైన వారు వెంటనే రంగంలోకి దిగాలని కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్(PCC President Mahesh Goud)​ సూచించారు. ఈ మేరకు వారితో జూమ్​ మీటింగ్​లో మాట్లాడారు.

Read all the Latest News on Aksharatoday.in