అక్షరటుడే, వెబ్డెస్క్: High Court | తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ (Justice Aparesh Kumar Singh) నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) సోమవారం ఆమోదించారు. ప్రస్తుతం హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్గా కొనసాగుతున్న సుజయ్ పాల్ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ అపరేష్ కుమార్ త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా (Tripura High Court Judge) పని చేశారు.
అపరేష్ కుమార్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చదివారు. 1990 నుంచి 2000 వరకూ యూపీ హైకోర్టులో న్యాయవాదిగా (UP High Court Judge) పనిచేశారు. అనంతరం 2001లో జార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2012లో జార్ఖండ్ హైకోర్టు అదనపు జడ్జీగా నియామకం అయ్యారు. అనంతరం జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 ఏప్రిల్ నుంచి త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి సాధించారు. తాజాగా తెలంగాణ తెలంగాణకు బదిలీపై వస్తున్నారు.